డివిజన్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా జిడబ్ల్యూఎంసీ కమిషనర్ ప్రావీణ్య
కాజీపేట, సెప్టెంబర్21 (ప్రజాజ్యోతి) ...// గ్రేటర్ 46వ డివిజన్ పరిధిలోని మెట్టుగుట్ట, మెట్టు రామన్న కాలనీలలో బుధవారం మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య పర్యటించి డివిజన్లోని ప్రతి ఒక్క సమస్యను పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారన్నారు. ఈ సందర్భంగా జిడబ్ల్యూఎంసీ కమిషనర్ ప్రావీణ్యతో 46వ డివిజన్ కార్పొరేటర్ మునిగాల సరోజన కరుణాకర్ కలిసి సంబంధిత శాఖల అధికారులతో క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకొన్నారన్నారు.