సైబర్ నేరాలపై పోలీసులు అవగాహన

Submitted by veerabhadram on Thu, 29/09/2022 - 22:22
Saiber crime

ప్రజాజ్యోతి సెప్టెంబర్ 29 చంద్రుగొండ

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల కేంద్రంలో సైబర్ సురక్షిత జాతీయ భద్రత కార్యక్రమం నిర్వహించిన చంద్రుగొండ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ కృష్ణ  సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. సైబర్ నగలు బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామని  తమ వివరాలు అడిగినా, ఓటీపీ అడిగిన తెలుపవద్దని ఏటీఎం సెంటర్ వద్ద ఎవరి సహాయం తీసుకోకుండా,జాగ్రత్త వహించాలన్నారు.ఈ కార్యక్రమంలో చంద్రుగొండ ఎంపీటీసీ 1 ఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ధారా వెంకటేశ్వరావు, చండ్రుగొండ టౌన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సూరా వెంకటేశ్వర్లు,సోషల్ మీడియా అధ్యక్షులు వంకాయలపాటి బాబురావు,మండల ఉపాధ్యక్షులు ఉన్నం నాగరాజు, సత్తి నాగేశ్వరావు, జిల్లా నాయకులు చీదెళ్ల పవన్ కుమార్, వీరప్రసాద్, పోలీస్ సిబ్బంది అశోక్,శివ,శంకర్, కోటి తదితరులు పాల్గొన్నారు.