జనగావ్
వాటర్ ట్యాంక్ ను తొలగించాలని డిమాండ్
వాటర్ ట్యాంక్ ను తొలగించాలని డిమాండ్
దేవరుప్పుల,అక్టోబర్ 21, (ప్రజాజ్యోతి):-
మండలంలోని భూక్యతండాలో గత కొన్ని నెలలుగా వాటర్ ట్యాంక్ నిరుపయోగంగా ఉంది. దీంతో అది శిధిలావస్థకు చేరింది అలాగే దానికి సంబంధించిన ఓ పిల్లర్ ఒకవైపు పాడైపోయింది. అయితే దాని పక్కనే భూక్య వెంకటేష్ అనే వ్యక్తి ఇల్లు ఉండడంతో అది ఎప్పుడు కూలిపోతుందో అనే భయాందోళనకు గురవుతున్నారు. గ్రామ పంచాయితీ పాలకవర్గం కు చెపితే పట్టించుకోవడం లేదని, సంబంధిత అధికారులు పట్టించుకోని సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.
అర్హతలు ఉన్నా ఆసరా పింఛను లేదు... ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న ఒంటరి దివ్యాంగ వృద్ద మహిళ
అర్హతలు ఉన్నా ఆసరా పింఛను లేదు
ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న ఒంటరి దివ్యాంగ వృద్ద మహిళ
ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ 127వ జయంతి వేడుకలు
కొడకండ్ల, (ప్రజా జ్యోతి) సెప్టెంబరు 26 : వీరనారి చాకలి ఐలమ్మ 127వ జయంతి వేడుకలు కొడకండ్ల మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామ రజక సంఘం అధ్యక్షుడు సట్టు సోమయ్య ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా సర్పంచ్ పసునూరి మధుసూదన్ పాల్గొని జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ పసునూరి మధుసూదన్ మాట్లాడుతూచాకలి ఐలమ్మ మహిళల ఆత్మగౌరవ ప్రతీకని, తెలంగాణ అస్థిత్వానికే ఐలమ్మ ఒక సంకేతమని,తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీర మాత, తెలంగాణ ప్రజల తెగువను, పోరాటస్ఫూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పుకణిక, సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన ధైర్యశాలని,సబ్బండ వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీక
గ్రూప్-1 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య
జనగామ, సెప్టెంబర్ 23. ప్రజాజ్యోతి:- జిల్లాలో నిర్వహించబోయే గ్రూప్ వన్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించటానికి పక్కా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య ఆదేశించారు.శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో గ్రూప్ వన్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లను సంబంధిత అధికారులతో కలెక్టర్ డిసిపి సీతారాంతో కలిసి సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అక్టోబర్ 16వ తేదీన జిల్లాలో 14 కేంద్రాల్లో నిర్వహించే గ్రూప్ వన్ పరీక్షలకు సుమారు మూడు వేలమందికి పైగా హాజరవుతున్నట్లు తెలియజేశారు.
పామాయిల్ తోటల పెంపకం తోనే రైతుల ఆర్థిక ప్రగతి. ఎంఎల్ఏ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి
జనగామ సెప్టెంబర్ 21, ప్రజాజ్యోతి :-స్థిర ఆదాయాన్నిచ్చే పామాయిల్ తోటల పెంపకం చేపట్టి రైతులు బలోపేతం కావాలని జనగామ శాసనసభ్యులు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పిలుపునిచ్చారు.బుధవారం జిల్లా కేంద్రంలోని హైదరాబాదు రోడ్డులో ఉన్న ఆయిల్ పేడ్ పామ్ ఆయిల్ నర్సరీలో జిల్లా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో రైతులకు జనగామ శాసనసభ్యులు జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి లతో కలిసి పామాయిల్ మొక్కలను పంపిణీ చేశారు.అనంతరం జిల్లా ఉద్యానవన శాఖ అధికారిని లత అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ప్రసంగిస్తూ దేశం యావత్తు ఆయిల్ కొరత ఎదుర్కొంటుందని ఇతర
వృద్ధ దంపతులపై దాడిని ఖండిస్తున్నాం
దాడిచేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి.
-తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ జర్నలిస్టుల సంఘం.
కలెక్టర్ శివలింగయ్య ప్రభుత్వ అధికారా? అధికార పార్టీ నాయకుడా?
తక్షణమే ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేయాలి
వికలాంగులు, మహిళలు అంటే అంత చులకనగా ఉందా..?
కలెక్టర్ పై ఎచ్ఆర్సి లో ఫిర్యాదు చేస్తాం
ఎన్పిఆర్డీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు బిట్ల గణేష్ డిమాండ్.
బహుజన రాజ్యాధికారం బిఎస్పీ తోనే సాధ్యం
చలో మునుగోడు రెండో విడత యాత్రను విజయవంతం చేద్దాం
బిఎస్పి జనగామ జిల్లా ఇన్చార్జి నీర్మాల రత్నం