జ్ఞాన సరస్వతి దేవి అవతారంలో అమ్మవారు
అభినవ్ యూత్ పుస్తకాలు పెన్నులు పెన్సిల్లు అందజేత
అభినవ్ యూత్ పుస్తకాలు పెన్నులు పెన్సిల్లు అందజేత
భూదాన్ పోచంపల్లి, అక్టోబర్ 02 (ప్రజా జ్యోతి)./...మండలంలోని పిలయపల్లి గ్రామంలో సర్పంచ్ అందేలా హరీష్ యాదవ్ ఎంపీటీసీ బంధారపు సుమలత లక్ష్మణ్ గౌడ్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గాంధీ సేవలు ప్రపంచానికె ఆదర్శం అని ఆ మహనీయులు బాటలో నేటి యువత ప్రయనించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు యువజన నాయకులు పాల్గొన్నారు.
భూదాన్ పోచంపల్లి, అక్టోబర్ 02 (ప్రజా జ్యోతి)./...మండలంలోని పిలయపల్లి గ్రామంలో సద్దుల బతుకమ్మసంబరాలకు సోమవారం రోజున తెలంగాణ గాన కోకిల విమలక్క విచ్చేస్తున్న సందర్భంగా ఆదివారం బహుజన బతుకమ్మ వాల్ పోస్టర్ ను పిల్లాయిపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పంచ్ అందెల హరీష్ యాదవ్ ఎంపీటీసీ బంధారపుసుమలత లక్ష్మణ్ గౌడ్ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డు
సభ్యులు బహుజన నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
లక్ష్మీనరసింహారావు జన్మదినోత్సవం-
తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు పోచంపల్లి రమణారావు
ఎమ్మెల్యే ఫైళ్ల మహిళా యోగ శిక్షణ కేంద్రం ప్రారంభం
కనుముక్కులలో బతుకమ్మ చీరలు పంపిణీ
భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 27 (ప్రజా జ్యోతి).///.. తెలంగాణ ఆడపడుచులకు పెద్ద అన్నగా కేసీఆర్ తోడుండటం ప్రతి మహిళలకు భరోసా అని జడ్పీటీసీ కోట పుష్పాలత మల్లారెడ్డి అన్నారు. భూదాన్ పోచంపల్లి మండలంలోని కనుముక్కుల గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన జడ్పీటిసి కోట పుష్పాలత మల్లారెడ్డి. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరమ్ మండల అధ్యక్షురాలు బత్తుల మాధవి శ్రీశైలం గౌడ్ సర్పంచ్ కోట అంజిరెడ్డి నాయకులు బత్తుల శ్రీశైలం గౌడ్ టీఆరెస్ నాయకులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 25 (ప్రజా జ్యోతి).///..మండలంలోని దేశముఖి గ్రామంలో ఉన్నా సెయింట్ మెరిస్ కళాశాలలో ఫార్మసీ విద్యార్థులు ఘనంగా అంతర్జాతీయ ఫార్మాసిస్ట్ డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాలలో నిర్వహించిన కార్యక్రమలు అవహుతులను అలరించాయి. అనంతరం ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ చూపాలని అలాగే కరోనా నియంత్రణలో ఫార్మసీ పాత్ర చాలా కీలకమైన పాత్ర అని ప్రపంచం మొత్తం ఫార్మాసిస్ట్ సేవలను గుర్తించాలని వారికి తగిన గౌరవం ఇవ్వాలని నినదించారు.
భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 25 (ప్రజా జ్యోతి).//... మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ శ్రీ శ్రీ మద్దెలఅమ్మ దేవి ఆలయంలో శ్రవణ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం శ్రీ స్వర్ణ కవచాలంకృత అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనము ఇచ్చారు.