పత్రిక సంపాదకుడిగా దీన్ దయాల్ సేవలు మరువలేనివి.. -ఘనంగా పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ 106వ జయంతి..
తాండూరు సెప్టెంబర్ 25 ప్రజా జ్యోతి :- వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని భారతీయ జనతా పార్టీ తాండూర్ ప్రధాన కార్యాలయంలో శ్రీ పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ 106వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం పలువురు బిజెపి నేతలు మాట్లాడుతూ 1952లో భారతీయ జన సంఘ్ లో చేరి ఉపాధ్యక్షులయ్యారని తదనంతరం 1967 లో జన సంఘ్ అధ్యక్ష పదవి చేపట్టే వరకు ఆ పదవిలో కొనసాగారని తెలియజేశారు. డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ మరణానంతరం పార్టీ బాధ్యతలను చేపట్టి విజయ పదంలో నడిపించారని గుర్తు చేశారు.