సేనర్జియా గ్రూప్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు
స్టేషన్ ఘనపూర్, అక్టోబర్ 02 చిల్పూర్ ( ప్రజాజ్యోతి ) : - మండలంలోని పల్లగుట్ట గ్రామములో చిల్పూర్ గుట్ట దేవస్థాన చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు సహకారంతో సేనర్జియా గ్రూప్ చైర్మన్ బ్రదర్ జాన్ ఆధ్వర్యంలో ఆదివారం జాతి పిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కటింగ్ చేసి వృద్దులకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేసారు. అనంతరం సెనర్జీయా గ్రూప్ వారు గ్రామ కార్యదర్శి నరసింహా చారిని శాలువాతో సన్మానించారు. ఈ సందర్బంగా గ్రామ కార్యదర్శి వారికి కృతజ్ఞతలు తెలిపారు.