మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత
నార్కట్ పల్లి, సెప్టెంబర్ 21( ప్రజాజ్యోతి): మండలంలోని వడ్డేపల్లి గ్రామానికి చెందిన భీమన బోయిన మల్లయ్య గత పది రోజుల క్రితం అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఇట్టి విషయం కాంగ్రెస్ పార్టీ వడ్డేపల్లి ఎక్స్ సర్పంచ్ తల్లోజు హనుమంతచారి ద్వారా సమాచారం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థి పాల్వాయి స్రవంతి మృతుని కుటుంబ సభ్యులకు 15000 వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేయడం జరిగింది.