మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

Submitted by Sathish Kammampati on Thu, 22/09/2022 - 14:03
Provide financial assistance to the family of the deceased

నార్కట్ పల్లి, సెప్టెంబర్ 21( ప్రజాజ్యోతి): మండలంలోని వడ్డేపల్లి గ్రామానికి  చెందిన భీమన బోయిన మల్లయ్య గత పది రోజుల  క్రితం అనారోగ్యంతో  మరణించడం జరిగింది. ఇట్టి విషయం  కాంగ్రెస్ పార్టీ వడ్డేపల్లి ఎక్స్ సర్పంచ్ తల్లోజు హనుమంతచారి ద్వారా సమాచారం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థి పాల్వాయి స్రవంతి  మృతుని  కుటుంబ సభ్యులకు 15000 వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేయడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ మీ కుటుంబాన్ని ఎల్లవేళలా ఆదుకుంటామని హామీ మృతుల కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు  గోవర్ధన్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కొమ్ము బిక్షం, దామెర సర్పంచ్ దామెర  యాదగిరి, బుషిపాక గోపాల్, కాటిక బాలరాజ్, వట్టికోటి సత్తయ్య, గోపు కొండలు, కొండపల్లి రమేష్, వట్టికోటి నరసింహ, గొల్లబోయిన జంగయ్య,తెరటి నరసింహ, తెరటి యాదయ్య, వట్టికోటి శేఖర్, గంప నరసింహ, తరటి యాదయ్య, గోపు అద్దాల సత్తయ్య  తదితరులు పాల్గొన్నారు.