బీసీ,ఎస్సీ,ఎస్టీ సబ్సిడీ రుణాలు వెంటనే విడుదల చేయాలి -జాజుల లింగంగౌడ్ డిమాండ్
మిర్యాలగూడ,సెప్టెంబర్ 30,ప్రజాజ్యోతి ః సబ్సిడీ రుణాలకు దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగ బీసీ,ఎస్సీ,ఎస్టీ యువత కొన్ని సంవత్సరాలుగా ఇంకెప్పుడు కార్పొరేషన్ నిధులు విడుదల చేస్తారేమోనని కళ్లలో ఒత్తులు పెట్టుకుని వేల మంది ఎదురు చూస్తున్నారని,ప్రభుత్వం వెంటనే వీరిని ఆదుకోవాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తు మహాత్మా జ్యోతిభాఫూలే విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ మాట్లాడుతూ బీసీ కార్పొరేషన్ రుణాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల 77 వేల మంది దరఖాస్తు చేసుకున్నారని,ఎన్నికల ముందు ఆర్భాటంగా కేవలం 40