స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ గా మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్ సింగ్

Submitted by venkat reddy on Sat, 24/09/2022 - 12:42
Miryalaguda RDO Rohit Singh as Special Grade Deputy Collector

-తెలంగాణలో 31 మందికి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి

ఫోటో రైటప్ ఃస్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ గా మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్ సింగ్

మిర్యాలగూడ,సెప్టెంబర్ 23,ప్రజాజ్యోతి : నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్ సింగ్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ గా పదోన్నతి పొందారు. ఆయన ఆర్డిఓ గా కొనసాగినంత కాలం మిర్యాలగూడలో భూ సమస్యలతో పాటు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేసేందుకు కృషి చేశారు. రోహిత్ సింగ్ కు పదోన్నతి రావడం పట్ల పలువురు అధికారులు, ఉద్యోగులు అభినందనలు తెలిపారు.

-తెలంగాణలో 31 మందికి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి 
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 31 మంది ఆర్డిఓ లకు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు కల్పిస్తూ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జీవో 308 శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతులు పొందిన వారిలో ఆర్ డి మాధురి, బి రోహిత్ సింగ్, ఏ పద్మశ్రీ, గుగులోతు లింగా నాయక్, మహమ్మద్ అసదుల్లా, కెవివి రవికుమార్, రాజ్యలక్ష్మి, స్వర్ణలత, జి వెంకటేశ్వర్లు, వి భుజంగరావు, డి వెంకట మాధవరావు, ఎం వెంకట్ భూపాల్ రెడ్డి, చీర్ల శ్రీనివాసులు, ఎస్ తిరుపతి రావు, చీమలపటి మహేందర్ జి, కె గంగాధర్, బి కిషన్ రావు, సల్వార్ సూరజ్ కుమార్, ఈ వెంకటాచారి విక్టర్, ఎల్ కిషోర్ కుమార్, పి అశోక్ కుమార్, ఎం విజయలక్ష్మి, జై శ్రీనివాస్, డి విజేందర్ రెడ్డి , కె శ్యామలాదేవి, కె వీర బ్రహ్మచారి, జే యల్ బి హరిప్రియ, కె లక్ష్మి కిరణ్,
డి వేణు, టిఎల్ సంగీత లు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులను పొందారు.