Haliya

మహాత్ముడి అడుగుజాడల్లో నడవాలి - టిడిపి పార్టీ నాగార్జునసాగర్ ఇన్చార్జి మువ్వా అరుణ్ కుమార్

Submitted by kareem Md on Mon, 03/10/2022 - 11:52

హలియా,సెప్టెంబర్02(ప్రజా జ్యోతి):   జాతిపిత మహాత్మాగాంధీ  అడుగుజాడల్లో నడవటమే ఆయనకు మనం ఇచ్చే ఘనమైన నివాళి అని నాగార్జునసాగర్ టిడిపి ఇన్చార్జ్ మువ్వ అరుణ్ కుమార్ అన్నారు.ఆదివారం హలియా పట్టణంలో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

దసరా కానుక బతుకమ్మ చీరెలు -కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు యడవల్లి నరేందర్ రెడ్డి

Submitted by kareem Md on Mon, 03/10/2022 - 11:12

హలియా,సెప్టెంబర్2(ప్రజా జ్యోతి) : తెలంగాణ రాష్ట్ర ఆడపడుచులకు దసరా కానుకగా బతుకమ్మ చీరలు ప్రభుత్వం పంపిణీ చేస్తుందని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు యడవల్లి నరేందర్ రెడ్డి అన్నారు.ఆధివారం హాలియా మున్సిపాలిటీ పరిధిలోని రెండవ వార్డులో బతుకమ్మ చీరలు ఆడపడుచులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి సామరస్యానికి పరమత సహనానికి మహిళలందరూ సుఖ సంతోషాలతో పండుగ జరుపుకోవాలన్నారు..ఈ కార్యక్రమంలో కో ఆప్షన్ నెంబర్ చాపల సైదులు,కొత్తపల్లి సొసైటీ డైరెక్టర్ నల్లబోతు వెంకటయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మహమ్మద్ అక్బర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

జాతిపిత కు ఘన నివాళి

Submitted by kareem Md on Mon, 03/10/2022 - 10:11

హాలియా,సెప్టెంబర్2( ప్రజా జ్యోతి):   కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీకి ఘన నివాళులు అర్పించారు. ఆదివారం జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని హాలియా మున్సిపాలిటీ ప్రధాన కూడలి లో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల పార్టీ అధ్యక్షుడు కూందూరు వెంకట్ రెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చింతల చంద్రారెడ్డి లు హాజరై చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం వారు మాట్లాడుతూ హక్కుల సాధనకై శాంతియుత పోరాట మార్గాన్ని ప్రవచించి ఆచరణలో చూపిన మహాత్ముడు చిరస్మరణీయుడు అన్నారు.

మెరుగైన వైద్య సేవలు అందించాలి - ఎమ్మెల్యే నోముల భగత్

Submitted by kareem Md on Sat, 01/10/2022 - 11:44

- ఏరియా హాస్పిటల్ ఆకస్మికతనికి
ఫోటో రైటప్: హాస్పిటల్ ను అకస్మిక తనిఖీ చేస్తున్న ఎమ్మెల్యే నోముల భగత్ 

దళిత బంధువుల మహాసభను విజయవంతం చేయాలి - జిల్లా అధ్యక్షుడు పోలే రవి

Submitted by kareem Md on Sat, 01/10/2022 - 11:38

హలియా,సెప్టెంబర్30(ప్రజా జ్యోతి): తెలంగాణ దళిత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అక్టోబర్ 03న హాలియాలో జరిగే దళిత బంధువుల ఐక్య మహాసభను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు పోలే రవి తెలిపారు.శుక్రవారం హాలియా మున్సిపాలిటీలో మహాసభ కరపత్రాన్ని ఆయన విడుదల చేశారు.అనంతరం  ఆయన మాట్లాడుతూ దళితుల అభివృద్ధికి అడ్డంకిగా ఉన్న కుల వ్యవస్థను  రూపుమాపడానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.విద్య,వైద్య ఉద్యోగ,రాజకీయ వ్యవస్థలో దళితులకు తగిన గౌరవం   దక్కేలా సంఘం పోరాటం చేస్తుందని తెలియజేశారు.

అప్రమత్తంగా ఉండాలి -ఎమ్మెల్యే నోముల భగత్

Submitted by kareem Md on Sat, 01/10/2022 - 10:24

-భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అందుబాటులో ఉండాలి

-సహాయక చర్యలకు అధికారులు సిద్ధంగా ఉండాలి

భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించాలి - కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చింతల చంద్రారెడ్డి

Submitted by kareem Md on Thu, 29/09/2022 - 16:27

హలియా,సెప్టెంబర్29(ప్రజా జ్యోతి): భక్తిశ్రద్ధలతో కనకదుర్గ అమ్మవారి శరన్నవరాత్రులు నిర్వహించుకోవాలని కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చింతల చంద్రారెడ్డి అన్నారు. గురువారం హాలియా మున్సిపాలిటీలో స్వయంభూశ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో చంద్రారెడ్డి దీప్తి దంపతులు సతి సమేతంగా విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.దేవాలయానికి విచ్చేసిన దంపతులకు నిర్వాహకులు వారిని ఘనంగా సన్మానించారు.

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు

Submitted by kareem Md on Thu, 29/09/2022 - 12:53

హలియా,సెప్టెంబర్28(ప్రజా జ్యోతి):  హాలియా మున్సిపాలిటీ లో ఐద్వా సంఘం,ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో స్థానిక త్రివేణి ఒకేషనల్ జూనియర్ కాలేజిలో బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా ఎస్సై క్రాంతి కుమార్,తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కూన్ రెడ్డి నాగిరెడ్డి హాజరై బతుకమ్మ ఉత్సవాలను తిలకించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆకారపు నరేష్ జిల్లా కార్యదర్శి కొర్ర శంకర్ నాయక్,ఐధ్వా సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కారంపూడి ధనమ్మ,ప్రిన్సిపల్ రమేష్, బాబు,నేనావత్ అశోక్, విజయా తదితరులు పాల్గొన్నారు.