వర్షాలు సమృద్ధిగా కురవాలని ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు
![]()
కొడంగల్, జూలై 03 (ప్రజాజ్యోతి)
వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలోని మక్కా మస్జీద్ లో శుక్రవారం వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆకాంక్షిస్తూ మైనారిటీ నాయకులు ఎస్ యం. గౌసన్ ఆధ్వర్యంలో ఇమామ్ అబ్దుల్ కరీం అశ్రఫీ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వర్షాకాలం ప్రారంభమైనా వర్షాల జాడ కనిపించడం లేదని, వర్షాలు సమృద్ధిగా కురిసి, పాడిపంటలు బాగా పండాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు ఎస్ యం.. గౌసన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

