జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎడ్ల నరేష్ రెడ్డి
మహబూబాబాద్ బ్యూరో అక్టోబర్ 02 (ప్రజా జ్యోతి): మహబూబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా గూడూరు మండలంలోని సీతానగరం గ్రామానికి చెందిన ఎడ్ల నరేష్ రెడ్డి ని రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కంకర అయ్యప్ప రెడ్డి నియమించినట్లు తెలిపారు. నరేష్ రెడ్డి గత కొన్ని సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పనిచేస్తున్నందుకు వారికి జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఇచ్చినట్లు తెలిపారు.