అచ్చంపేట
అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు. గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు దేశ నాయక్
అచ్చంపేట సెప్టెంబర్ 29 (ప్రజా జ్యోతి).//..అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు దేశ నాయక్ ప్రధాన కార్యదర్శి శంకర్ నాయక్ అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి గిరిజనుల కు రిజర్వేషన్ జీవో అమలు చేస్తానని ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోవడంతో గురువారం రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమాలు చేపట్టకుండా పోలీసులు అరెస్టు చేసి నిర్బంధించారని వారు పేర్కొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వారం రోజుల్లో రిజర్వేషన్ జీవో తీసుకొస్తానని చెప్పిన మాట తప్పారని ఎందుకు నిరసనగా అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉండగా ముందస్తుగానే పోలీసులు
చిరుధాన్యాల పంటలను పరిశీలించిన ప్రత్యేక బృందం.
అచ్చంపేట సెప్టెంబర్ 29 ప్రజా జ్యోతి. బల్మూర్ మండలంలోని మైలారం అనంతవరం గ్రామాలలో గురువారం చిరుధాన్యాల పంటలను ప్రత్యేక బృందం పరిశీలించింది ఈ సందర్భంగా సజ్జ రాగి పంటలను ఐఐఎం ఆర్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ బృందం సభ్యులు చిరుధాన్య పంటలను పండించే విధానం గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు అదే విధంగా చిరుధాన్యాలపై రైతుల అభిప్రాయాన్ని తెలుసుకొని వీడియో చిత్రీకరణ చేయడం జరిగింది చిరుధాన్య పంటలను ఎంచుకోవడానికి గల కారణాలను వారు పండించే విధానం కలుపు చీడపీడలు నివారణ ఉత్పాదన కొత్త చిరుధాన్య పంటలు చేయాలనుకునే రైతులకు వారికి సలహాలు సూచనలు వచ్చే విధానం గురించి ప్రత్యేక బృందం తెలుసుకున్నారు
ఎమ్మెల్యే స్థాయి మరిచిపోయి గువ్వల బాలరాజు దాడులకు పాల్పడుతున్నాడు
మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ.
పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ జయంతి వేడుకలు.
అచ్చంపేట సెప్టెంబర్ 25 ప్రజా జ్యోతి. కొండా లక్ష్మణ్ బాపూజీ 107వ జయంతి సందర్భంగా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మంగళవారం అచ్చంపేట పట్టణంలో భక్త మార్కండేయ ఆలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలు జరుపుకున్నారు అదేవిధంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మార్కండేయ ఆలయంలో ఏర్పాటు చేసిన అమ్మవారికి పద్మశాలీలు ప్రత్యేక పూజలు నిర్వహించారు రెండవ రోజు బాల త్రిపుర సుందరిగా అమ్మవారు దర్శనమిచ్చారు మహిళలు పాల్గొని ప్రత్యేక పూజలతో పాటు గణపతి హోమం మల్లికార్జున స్వామికి అభిషేకం అమ్మవారికి పూజలు బతకమ్మ కోలాటాల కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షులు
ఐటిడిఎ'ఆర్ డి టి అందిస్తున్న పథకాలను చెంచులు సద్యినయోగం చేసుకొవాలి. జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్.
అచ్చం పేట సెప్టెంబర్.27 ప్రజాజ్యోతి. ఆర్థికంగా వెనుకబడిన చెంచుల జీవనోపాధికి ఐ టి.డి.ఏ , ఆర్.డి.టీ ద్వారా వంద శాతం సబ్సిడీతో ఇస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకొని ఆర్థిక స్వాలంబన సాధించాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అన్నారు. మంగళవారం మధ్యాహ్నం మన్ననూర్ గిరిజన భవనం లో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 52 గ్రామాల చెంచు కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ. లక్ష విలువ చేసే ఉపాధి యూనిట్లను 500 కుటుంబాలకు మంజూరు చేయడం జరుగుతుందన్నారు.
బడుగు బలహీన వర్గాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
అన్ని వర్గాలకు ప్రభుత్వ ఫలాలు అందించడమే కేసీఆర్ లక్ష్యం
ఎమ్మెల్యే గువ్వల బాలరాజు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి. మున్సిపల్ చైర్మన్ నరసింహ గౌడ్.
అచ్చంపేట సెప్టెంబర్ 26.ప్రజా జ్యోతి.
బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ నర్సయ్య.
అచ్చంపేట సెప్టెంబర్ 26 ప్రజా జ్యోతి. బల్మూర్ మండలంలోని పోలిశెట్టి పల్లి గ్రామంలో ప్రభుత్వం సరఫరా చేసిన బతుకమ్మ చీరలను సోమవారం కొండనాగుల సింగిల్విండో చైర్మన్ నరసయ్య యాదవ్ మహిళలకు పంపిణీ చేశారు అదేవిధంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో పాల్గొని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి సంవత్సరం దసరా పండుగకు ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి బతుకమ్మ సంబరాలు పురస్కరించుకొని బతుకమ్మ చీరలు పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు ఎల్లయ్య యాదవ్ మాజీ సర్పంచ్ రామచంద్రన్ డైరెక్టర్ అంజిరెడ్డ