యూరియా పంపిణీ పరిశీలన
— జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి
రామారెడ్డి జూన్ 16 (ప్రజా జ్యోతి)
రామారెడ్డి మండలము లో యూరియా పంపిణీని పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రెడ్డి.ఆన్లైన్ యాప్ ద్వారా యూరియా పంపిణీ పరిశీలించి రైతులకు పలు సూచనలు చేశారు.రైతులు అధైర్య పడవద్దని యూరియా అందుబాటులో ఉందని తెలియచేశారు.ప్రైవేట్ షాపు లను తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు.అధిక ధరలకు విక్రయించవద్దని సూచించారు. కార్యక్రమంలో ఏడిఏ సుధా మాధురి, ఏవో భానుశ్రీ, వ్యవసాయ విస్తీర్ణాధికారి రాకేష్, తదితరులు పాల్గొన్నారు.
