జాతీయ నులిపురుగుల నిర్మూలన దినం ప్రారంభోత్సవం

Submitted by Sathish Kammampati on Thu, 15/09/2022 - 15:57
 Inauguration of National Deworming Day

నార్కట్ పల్లి; సెప్టెంబర్ 15( ప్రజా జ్యోతి).   మహాత్మ జ్యోతిరావు పూలే తెలంగాణ రాష్ట్ర బాలుర గురుకుల పాఠశాల నార్కట్ పల్లి లో మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు సూది రెడ్డి నరేందర్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే  చదువుల్లో గాని، క్రీడల్లో గాని రాణించడం జరుగుతుందని، అదేవిధంగా మంచి  మనో వికాసమున కు నులిపురుగుల నివారణ అవసరమని، ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆల్బెండజోల్ మాత్రలు విద్యార్థులు  నమిలి  తినాలి అని విద్యార్థులకు ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో  స్థానిక సర్పంచ్  దూదిమెట్ల స్రవంతి   వెంకటేశ్వర్లు، పాఠశాల ప్రిన్సిపల్ లక్ష్మయ్య، వైద్యాధికారి డాక్టర్ లహరి، సామాజిక ఆరోగ్య అధికారి బడుగు శ్రీరాములు، పర్యవేక్షకులు పద్మ، చంద్రకళ، ఆరోగ్య సిబ్బంది، ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.