జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు పకడ్బందీగా నిర్వహించాలి
- నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
చిట్యాల సెప్టెంబర్ 12(ప్రజాజ్యోతి) ఈ నెల 16వ తేదీనా నిర్వహించనున్న తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా నకిరేకల్ నియోజకవర్గ పరిధిలో తలపెట్టిన ఏర్పాట్లపై సోమవారం నాడు నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య నార్కట్ పల్లి పట్టణంలోని ఆయన నివాసంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.