పోలీస్ క్రీడల్లో ‘వరంగల్ కమిషనరేట్’ ను వరించిన తొలి గోల్డ్ మెడల్..
వరంగల్ / ప్రజాజ్యోతి ::
నేటి నుండి ప్రారంభంగానున్న నాలుగోవ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ డ్యూటీ మీట్ లో వరంగల్ కమిషనరేట్ పోలీసులు బంగారు పతకంతో బోణి కొట్టారు. ఈ క్రీడల్లో మొదటగా నిర్వహించిన పది కిలోమీటర్ల పరుగు పందెంలో వరంగల్ రిజర్వ్ విభాగానికి చెందిన గూగులోత్ మౌనిక 10 కిలో మీటర్ల పరుగులో గోల్డ్ మెడల్ సాధించడంతో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పతకాల ఖాతా ప్రారంభించింది. ఈ మెడల్ సాధించిన మౌనికను పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అభినందనలు తెలిపారు
