అడుగడుగునా ఆటంకాలు: సర్వసభ్య సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేసిన గోపాలపురం సర్పంచ్ నాగ సైదయ్య
హుజుర్ నగర్ అక్టోబర్ 1 ( ప్రజా జ్యోతి) : గ్రామ అభివృద్ధికి సహకరించకుండా అడుగడుగునా టిఆర్ఎస్ నాయకులు అడ్డుకుంటున్నారని గోపాల పురం సర్పంచ్ నాగ సైదయ్య అన్నారు.శనివారం హుజూర్ నగర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో నాయకులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ అధికారుల పనితీరును వారికి సహకరిస్తున్న పాలకుల పైన తీవ్ర స్థాయి లో ధ్వజమెత్తారు.