దసరా సెలవుల నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ఎస్ ఐ మంగీలాల్.
నర్సింహులపేట సెప్టెంబర్ 24 ప్రజా జ్యోతి. మండల ప్రజలకు విజ్ఞప్తి దసరా సెలవులు నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ఎస్ ఐ మంగీలాల్. దసరా పండుగ నేపథ్యంలో 15 రోజులు సెలవు ఉన్నందున విద్యార్థుల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని చెరువులు, కుంటలు, బావిలు నిండుకుండలా ఉన్నాయని ఆయన అన్నారు. తదితరుల ప్రాంతాల వైపు పిల్లలు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వకుండా తాగు జాగ్రత్తలు పాటించి వాహన ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని ఆయన కోరారు. తల్లితండ్రుల పిల్లల నడవడికపై దృష్టి సారించాలని ఎస్ ఐ మంగీలాల్ సూచించారు.