టెక్స్ టైల్ పార్కును సందర్శించిన ఎమ్మెల్యే అరూరి
కాజీపేట, అక్టోబర్03 (ప్రజాజ్యోతి)./...మడికొండ ఇండస్ట్రీయల్ కారిడార్ లోని టెక్స్ టైల్ పార్క్ ను తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రీయల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండి ఈవి నరసింహ రెడ్డి తో కలిసి తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ సోమవారం సందర్శించారు. ఈ సందర్బంగా అక్కడి పరిశ్రమలలో వస్త్రాల తయారు విధానాన్ని, నాణ్యతను ఎమ్మెల్యే అరూరి రమేష్ పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేనేత రంగాన్ని, టెక్స్ టైల్ పరిశ్రమల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్ల తెలిపారు.