భక్తిశ్రద్ధలతో శరన్నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవాలి
ప్రజా జ్యోతి జాజిరెడ్డి గూడెం 29సెప్టెంబర్ .//.. భక్తిశ్రద్ధలతో శరన్నవరాత్రోత్సవాలను జరుపుకోవాలని ఆరాధ్య ఫౌండేషన్ చైర్మన్ తాడోజు వాణి శ్రీకాంత్ రాజు అన్నారు. గురువారం జాజిరెడ్డి మండల కేంద్రంలో ని అర్వపల్లి గ్రామంలో కొమరం భీమ్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు ఉత్సవ కమిటీ సభ్యులు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని తెలిపారు .అన్నదానం గొప్పదానమని ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించిన కొమరం భీమ్ యూత్ ను అభినందించారు.