దర్గా పీఠాధిపతి ఖుస్రు పాషాను పరామర్శించిన నాయిని...

Submitted by veerareddy on Tue, 20/09/2022 - 13:02
Naini visited Dargah President Khusru Pasha...

కాజీపేట టౌన్, సెప్టెంబర్20 (ప్రజాజ్యోతి).. కాజీపేట దర్గా పీఠాధిపతి ఖుస్రుపాష తల్లి సోమవారం రాత్రి  అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న హన్మకొండ, వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి మంగళవారం  ఖుస్రు పాషా, వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియ చేసారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి కార్యదర్శి మొహమ్మద్ అయూబ్, గ్రేటర్ వరంగల్ మైనారిటీ సెల్ చైర్మన్ మీర్జా అజీజిల్లా బేగ్, స్థానిక డివిజన్ అధ్యక్షుడు సింగారపు రవిప్రసాద్, యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పిన్నోజు ప్రదీప్, శ్రీనివాస్ యాదవ్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు