కాజిపేట్

ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం జాతీయ జెండాను ఆవిష్కరించిన జక్కుల

Submitted by veerareddy on Sat, 17/09/2022 - 14:54

కాజీపేట, సెప్టెంబర్17 (ప్రజాజ్యోతి).    కాజీపేట చౌరస్తాలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 62 వ డివిజన్ కార్పోరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్  మాట్లాడుతూ 1947 ఆగస్టు 15న భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా హైదరాబాదు సంస్థానంలో తెలంగాణ ప్రాంతంలో స్వాతంత్రం సిద్ధించ లేదని, నిజాం నవాబు మాత్రం ఫ్యూడల్ వ్యవస్థ ఏర్పాటు చేసి రజాకార్లను ప్రోత్సహించరన్నారు.

జన శిక్షణ సంస్థాన్ మెగా సర్టిఫికేట్ ప్రధానోత్సవం

Submitted by veerareddy on Sat, 17/09/2022 - 14:37

కాజీపేట, సెప్టెంబర్16 (ప్రజాజ్యోతి)// భారత ప్రభుత్వ నైపుణ్య అభవృద్ధి మంత్రిత్వ శాఖ  వారి కౌశల్ దీక్షాంత్ సమారోహం లో భాగంగా  జన శిక్షణ సంస్థాన్, వరంగల్ ఆధ్వర్యంలో మెగా సర్టిఫికేట్ ప్రధానోత్సవ కార్యక్రమం  జరుగుతుందని జేఎస్ఎస్ డైరెక్టర్ ఖాజా మసియద్దీన్ ఒక ప్రకటనలో తెలయజేశారు. ఈ కార్యక్రమంలో గత సంవత్సరం జేఎస్ఎస్ ద్వారా శిక్షణ పొందిన అభ్యర్థులకు సర్టిఫికేట్ ప్రధానం చేస్తారని ఆయన తెలిపారు.

భవన నిర్మాణ కార్మికుల మహాసభను జయప్రదం చేయాలి

Submitted by veerareddy on Sat, 17/09/2022 - 13:24

కాజీపేట, సెప్టెంబర్16 (ప్రజాజ్యోతి)  హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఆడిటోరియంలో ఈ నెల 18వ తేదిన మ.12 గంటలకు జరగబోయే తెలంగాణ భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం  వరంగల్ ఉమ్మడి జిల్లాల మహాసభను జయప్రదం చేయాలని వరంగల్ ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు ఇమ్మడి రాజు కార్మికులకు పిలుపునిచ్చారు.

మృతుడి కుటుంబానికి పరామర్శ

Submitted by veerareddy on Thu, 15/09/2022 - 16:51


 కాజీపేట, సెప్టెంబర్ 15 (ప్రజాజ్యోతి). టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు, ఎస్సీ సెల్ అధ్యక్షుడు కుమ్మరి రాజయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ రాజయ్య కు నివాళులర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రాజయ్య కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటానని తెలిపారు.ఈ కార్యక్రమంలో 62వ డివిజన్ అధ్యక్షులు పాలడుగుల శివకుమార్, సుంచు కృష్ణ, కుమ్మరి రాజ్ కుమార్ , పాలడుగుల రామస్వామి, సంచు రఘు రామ్, సుబ్బు, అనిల్, రాజేందర్, ప్రవీణ్ కుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ సీనియర్ నాయకుడు మృతి

Submitted by bosusambashivaraju on Mon, 12/09/2022 - 10:42

కాజీపేట, సెప్టెంబర్ 11 (ప్రజాజ్యోతి). మడికొండ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు బోల్లికొండ విజయరామ్ గౌడ్  శనివారం రాత్రి అకాల మృతి చెందారు. ఈసందర్భంగా హనుమకొండ మాజీ  ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, వర్దన్నపేట మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ  దళిత మోర్చా రాష్ట్ర నాయకులు బన్న ప్రభాకర్, మడికొండ బిజెపి సీనియర్ నాయకులు కార్యకర్తలు ఆయన పార్థివదేహానికి భారతీయ జనతా పార్టీ జెండా కప్పి నివాళులర్పించి, కుటుంబానికి సంతాపం తెలియచేశారు.

గణపతి మండపంలో కుంకుమపూజ

Submitted by veerareddy on Thu, 08/09/2022 - 17:08

కాజీపేట, సెప్టెంబరు 08 (ప్రజాజ్యోతి). రహమత్ నగర్పాక రాజయ్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 27వ గణపతి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా ఉదయం  హోమ కార్యక్రమం, మహిళలచే కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో ఓం ప్రకాష్, వేద ప్రకాష్, పాము రాజేష్ కుమార్, మహేందర్ ఠాగూర్, పాకరాజేశ్వరి పాక శోభారాణి, పాము గాయత్రి గిన్నారపు మంజుల, సంధ్య, హరిత రమాదేవి తదితరులు పాల్గొన్నారు

షీ టీమ్స్ ఆధ్వర్యంలో సైబర్ కాంగ్రెస్ పై అవగాహన

Submitted by veerareddy on Thu, 08/09/2022 - 16:49

కాజీపేట, సెప్టెంబర్ 08 (ప్రజాజ్యోతి)   షీ టీమ్స్ అధ్వర్యములో సైబర్ కాంగ్రెస్ లో భాగంగా విద్యార్థులకు సైబర్ కాంగ్రెస్ పై కాజీపేట ప్రభుత్వ బాలికల పాఠశాలలో అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆన్ లైన్ లో జరిగే మోసాలపై, ప్రేమలు, పరిచయాలపై, ఫోటో ల మార్ఫింగ్ లపై వివరించారు. అకౌంట్లలలోని మొత్తాలను ఎలా కొల్ల గొట్టుతున్నారో అనే విషయాలను పూర్తిగా తెలియచేశారు. సైబర్ కాంగ్రెస్ కు మెంటర్ గా పనిచేస్తున్న సిహెచ్ శ్రీలత పలు అంశాలపై అవగాహన కల్పించారు. సైబర్ కాంగ్రెస్ కు అంబాసిడర్ గా పనిచేస్తున్న అమ్మాయి కుమారి వెన్నెల సెల్ ఫోన్ ద్వారా జరిగే మోసాలను వివరరించారు.