ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం జాతీయ జెండాను ఆవిష్కరించిన జక్కుల
కాజీపేట, సెప్టెంబర్17 (ప్రజాజ్యోతి). కాజీపేట చౌరస్తాలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 62 వ డివిజన్ కార్పోరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ 1947 ఆగస్టు 15న భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా హైదరాబాదు సంస్థానంలో తెలంగాణ ప్రాంతంలో స్వాతంత్రం సిద్ధించ లేదని, నిజాం నవాబు మాత్రం ఫ్యూడల్ వ్యవస్థ ఏర్పాటు చేసి రజాకార్లను ప్రోత్సహించరన్నారు.