- సమస్యలు పరిష్కరించండి.
- డిటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రామస్వామి.
అచ్చంపేట సెప్టెంబర్ 13 ప్రజా జ్యోతి. సమస్యలను పరిష్కరించాలని చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళుతుండగా ఉపాధ్యాయులను ఎక్కడికక్కడే అరెస్టు చేయడం అప్రజా స్వామికమని డిటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రామస్వామి అన్నారు మంగళవారం అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళుతున్న సమయంలో ఉపాధ్యాయులను అరెస్టు చేసి పోలీసులు అచ్చంపేట పోలీస్ స్టేషన్ తరలించారు పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం సమంజసం కాదన్నారు అరెస్టు చేయడం కాదు ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు పాఠశాలల్లో అన్ని మౌలిక వసతులు కల్పించాలని అన్నారు అదేవిధంగా 8 సంవత్సరాల నుంచి ఉపాధ్యాయులకు ప్రమోషన్స్ లేవు నాలుగు సంవత్సరాలుగా బదిలీలు లేవు 17 సంవత్సరాల నుంచి పర్యవేక్షణ అధికారులు లేరు ఆరు సంవత్సరాలుగా నియమాకాలు లేవని ఈ సమస్యలన్నీ ప్రభుత్వం పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.