బిబినగర్, సెప్టెంబర్ 13 (ప్రజా జ్యోతి) ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఆరోగ్యమే మహాభాగ్యం అని ఎంపీపీ యర్కల సుధాకర్ గౌడ్ పిలుపునిచ్చారు. బిబినగర్ మాండల పరిధిలో స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి సహకారంతో శ్రీ సత్య సాయి అన్నపూర్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో వెంకిర్యాల పీఎస్, వెంకిర్యాల జడ్పీహెచ్ఎస్, రహీంఖాన్ గూడ పీఎస్, రాఘవాపురం పీఎస్, మరియు రుద్రవెల్లి పీఎస్ లలో అల్పాహార పంపిణీ కార్యక్రమంలో భాగంగా రాగిజావను పిల్లలకు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీపీ యర్కల సుధాకర్ గౌడ్. ఈ సందర్భంగా వంట మనిషి వేతనం కొరకు వెంకిర్యాల గ్రామంలో 49,000 రూపాయలు, రహీంఖాన్ గూడలో 3500 రూపాయలు, రాఘవపురం లో 10,000 రూపాయలు ఆయా గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డ్ సభ్యులు, తెరాస నాయకులు విరాళంగా ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గండు వసంత బస్వయ్య వెంకిర్యాల సర్పంచ్ అరిగె సుదర్శన్ రహీంఖాన్ గూడ సర్పంచ్ మంచాల రవికుమార్ రాఘవపురం సర్పంచ్ స్వప్న కృష్ణ రుద్రవెల్లి సర్పంచ్ మన్నె రాజేందర్ ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపసర్పంచులు, వార్డ్ సభ్యులు, తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు.
- 3 views