మహిళా గ్రూపులకు సైబర్ నేరాలపై అవగాహన

Submitted by veerareddy on Mon, 19/09/2022 - 13:21
 Cyber ​​crime awareness for women groups

కాజీపేట, సెప్టెంబర్18 (ప్రజాజ్యోతి),,  వరంగల్ మహా నగర పాలక సంస్థ పరిధిలోని కాజీపేట దర్గాలోని మహిళా సమాఖ్య గ్రూపులకు కాజీపేట పట్టణ  సర్కిల్ ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి సైబర్ నేరాలపై ఆదివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ మోసాలు, లోన్ యాప్ మోసాలు, ఓఎల్ఎక్స్ మోసాలు, పెట్టుబడి మోసాలు మొదలైన వాటిని నిరోధించడానికి సైబర్ నేరాల గురించి వారికి వివరించారు. ఈ అవగాహన కార్యక్రమంలో మహిళ సమాఖ్య గ్రూపులకు సంబంధించిన మహిళలు, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.