బిబినగర్, సెప్టెంబర్ 14 (ప్రజా జ్యోతి) సంపూర్ణ ఆరోగ్యంకు రాగిజావ ఎంతో మేలు చేస్తోంది అని ప్రతీ ఒక్కరూ తప్పకుండా సేవించాలి అని బిబినగర్ ఎంపీపీ యర్కల సుధాకర్ అన్నారు. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి సహకారంతో శ్రీ సత్య సాయి అన్నపూర్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో బిబినగర్ మండలంలోని బ్రాహ్మణపల్లి యుపిఎస్, చిన్నరావలపల్లి పీఎస్, చిన్నరావులపల్లి జడ్పీహెచ్ఎస్ భట్టుగూడెం పీఎస్, భట్టుగూడెం జడ్పీహెచ్ఎస్ లలో అల్పాహార పంపిణీ కార్యక్రమంలో భాగంగా రాగిజావను పిల్లలకు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీపీ యర్కల సుధాకర్ గౌడ్.
ఈ సందర్భంగా వంట మనిషి వేతనం కొరకు బ్రాహ్మణపల్లి గ్రామంలో 6000రూపాయలు, చినరావులపల్లి గ్రామంలో 11500 రూపాయలు, భట్టుగూడెం గ్రామంలో 21000 రూపాయలు ఆయా గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డ్ సభ్యులు, తెరాస నాయకులు విరాళంగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరమ్ అధ్యక్షులు గోరకంటి బాలచందర్ ఎంపీటీసీ కొలను సత్యమని బ్రాహ్మణపల్లి సర్పంచ్ సురకంటి సత్తి రెడ్డి చినరావులపల్లి సర్పంచ్ బక్కన్న బాలమణి శ్రీనివాస్ భట్టుగూడెం సర్పంచ్ గగ్గిలపల్లి మాధవి పురుషోత్తం ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపసర్పంచులు, వార్డ్ సభ్యులు, తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు.
- 29 views