కాజీపేట టౌన్, సెప్టెంబర్23 (ప్రజాజ్యోతి) ..//. సర్వ మతాలకు ప్రతీక,సమైక్యతకు ప్రతిరూపం ఖాజీపేట దర్గా అని ప్రభుత్వ చీఫ్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. శుక్రవారం కాజీపేట దర్గా, పీఠాధిపతి ఖుస్రూ పాషా, అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన చీఫ్ విప్ మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యంత ప్రాధాన్యత కల్గిన దర్గా ఉర్సు, ఉత్సవాలు ఘనంగా మూడు రోజులు పాటు 24, 25, 26, చందనోత్సవము (సందల్), ఉర్సు షరీఫ్, బదావా, కార్యక్రమలు జరుపుకుంటారని తెలిపారు.దేశంలో అనేక ప్రాంతాలు, ఇతర దేశాల నుండి భక్తులు వస్తారని అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ప్రభుత్వ పరంగా పూర్తి చేసామని తెలిపారు.