కరాటేలో ప్రతిభ కనబరిచిన మడికొండ చిన్నారులు
కాజీపేట, సెప్టెంబర్19 (ప్రజాజ్యోతి).../ ఆత్మరక్షణ కోసం కరాటే ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని మడికొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ వేణు అన్నారు. బై టైగర్ కిక్ బాక్సింగ్ అకాడమీ వారు హైదరాబాద్ పటాన్ చెరువులో నిర్వహించిన ఫస్ట్ నేషనల్ కరాటే, కుంగ్ ఫు ఛాంపియన్షిప్ 2022 పోటీలలో మడికొండ గ్రామానికి చెందిన విద్యార్థులు పోటీలో పాల్గొని బహుమతులు సాధించారు. బహుమతులు సాధించిన వారిలో యశ్వంత్, దీపక్, విశ్వతేజ, దైవతేజ, భవిత్ శ్రీ ద్వితీయ బహుమతులు సాధించగా హర్షవర్ధన్, మణి స్వామి, చరణ్ సాయి రెడ్డి లు సాదృశ్య, యశ్వంత్ లు తృతీయ బహుమతులు సాధించారు. వీరిని మడికొండ సిఐ అభినందిచారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ లు నరసింహారావు, దివ్య, ప్రిన్సిపల్ చరణ్, జై కోచ్ రామకృష్ణ, పల్లపురాజుకుమార్, రాహుల్, తరుణ్, కళ్యాణ్, ప్రసాద్ పాల్గొన్నారు.
- 3 views