డివిజన్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా జిడబ్ల్యూఎంసీ కమిషనర్ ప్రావీణ్య

Submitted by veerareddy on Thu, 22/09/2022 - 12:48
The division will work to solve the problems GWMC Commissioner Pravinya

కాజీపేట, సెప్టెంబర్21 (ప్రజాజ్యోతి)  ...// గ్రేటర్ 46వ డివిజన్ పరిధిలోని మెట్టుగుట్ట, మెట్టు రామన్న కాలనీలలో బుధవారం మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య పర్యటించి డివిజన్లోని ప్రతి ఒక్క సమస్యను పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారన్నారు. ఈ సందర్భంగా జిడబ్ల్యూఎంసీ కమిషనర్ ప్రావీణ్యతో 46వ డివిజన్ కార్పొరేటర్ మునిగాల సరోజన కరుణాకర్ కలిసి సంబంధిత శాఖల అధికారులతో క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకొన్నారన్నారు. మెట్టుగుట్ట విఘ్నేశ్వర దేవాలయం నుండి పాలగుండం వరకు 40 పీట్ల  రోడ్డును, స్థానిక కార్పొరేటర్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే సంబంధిత అధికారులకు చెప్పి కార్యాచరణ సిద్ధం చేసి సమస్య పరిష్కరించే దిశగా ముందుకు పోవాలని ఆదేశాలు ఆదేశాలు జారీ చేశారన్నారు.
ఈ కార్యక్రమంలో 46వ డివిజన్ అధ్యక్షుడు బొల్లికొండ వినోద్ కుమార్, 64వ డివిజన్ అధ్యక్షుడు దువ్వ శ్రీకాంత్, మడికొండ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు దువ్వ నవీన్, 46వ డివిజన్ మడికొండ పట్టణ శాఖ అధ్యక్షులు వల్లెపు ఉపేందర్, టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్ నర్మేటి బిక్షపతి గాండ్ల, డివిజన్ ఉపాధ్యక్షుడు కొలిపాక కుమార్ బాబు, డివిజన్ బిసి సెల్ అధ్యక్షులు పల్లపు కుమార్ రాజ్ , మడికొండ పట్టణ బిసి సెల్ అధ్యక్షులు గోపనబోయిన రాజు తెరాస నాయకులు రాసమల్ల వెంకటస్వామి, వసుకుల దేవేందర్, పల్లపు రాజ్ కుమార్, మునిగాల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.