నూతన లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ నగదు అందజెత

Submitted by Ramesh Peddarapu on Wed, 14/09/2022 - 18:27
Asara Pension Cash Award to New Beneficiaries

పాలక వీడు,సెప్టెంబర్14(ప్రజా జ్యోతి): ఇటీవల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షల మం చ్ది కొత్త లబ్ది దారులకు సి ఎం. కె సి అర్ ఆసరా పెన్షన్ పథకం అమలు చేయగా. పాలకీడు మండలం లో మొత్తం 808 మందికి లబ్ది చేకూరింది. కాగా మండల పరిధిలోని గుండెబోయిన గూడెం గ్రామంలో 14 మందికి రూ.రెండు వెయిల పదహార్లు .మండల తెరాసా పార్టీ అధ్యక్షుడు కిష్టపాటీ అంజిరెడ్డి చేతులమీదుగా అందించారు.లబ్ది దారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా అంజిరెడ్డి మాట్లాడుతు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్  మీ అవసరాలకు సరిపడా ఉండాలని వృద్దులు ఆత్మాభిమానం తో ఒకరి దగ్గర చెయ్యి చాచకుండ వుండేందుకు రెండు వందలున్న ఆసరా పథకాన్ని రెండు వేలకు పెంచి ప్రతి ఒక్కలకి పెద్దకొడుకు అయ్యారాన్నరు.

కాబట్టి ప్రతి ఒక్కరూ కెసిఆర్ నీ మళ్ళీ ముఖ్యమంత్రి గా గెలిపించుకోవాలని కోరారు. కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ నేరేడు సైదులు,గ్రామ శాఖా అధ్యక్షుడు వెంకట్ నాయుడు,నాయకులు శోబాన్ బాబు, పొన్నపుల శ్రీనివాస్,యాతం అంకయ్య,  బ్రహ్మ నాయుడు, బూతరాజు లింగయ్య,కార్యదర్శి శివకృష్ణ తదితరులు వున్నారు.