సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన

Submitted by veerareddy on Tue, 20/09/2022 - 12:15
 Awareness of students on cyber crime

కాజీపేట, సెప్టెంబర్19 (ప్రజాజ్యోతి),.../   మడికొండ సెయింట్  మ్యాథ్యూస్ హై స్కూల్ లో సోమవారం మడికొండ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ జయరాజు, కానిస్టేబుల్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో విద్యార్థులకు సైబర్ నేరాలు, వివిధ అంశాలపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా హెడ్ కానిస్టేబుల్ జయరాజు మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, స్కూలుకు కాలినడకన వచ్చేవారు ఎడమవైపే నడవాలని, తల్లిదండ్రులు బండిమీద తీసుకువచ్చే అప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ రూల్స్ పై విద్యార్థులందరూ అవగాహన పెంపొందించుకోవాలని తెలిపారు. అలాగే తమ తోటి విద్యార్థి పట్ల ప్రేమ కలిగి ఉండాలని, ఏ సమస్య వచ్చినా 100 నెంబర్ కు డయల్ చేయాలని విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సెయింట్ మ్యాథ్యూస్ స్కూల్ యాజమాన్యం, సిబ్బంది, పోలీస్ సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.