మృతుని కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే అరూరి

Submitted by veerareddy on Mon, 19/09/2022 - 14:10
MLA Aruri visited the family of the deceased

కాజీపేట, సెప్టెంబర్18 (ప్రజాజ్యోతి),. ఐనవోలు మండలం కొండపర్తి గ్రామంలో తంపుల వీరలక్ష్మి అనారోగ్యంతో మరణించడంతో వరంగల్ జిల్లా తెరాస అధ్యక్షులు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ ఆదివారం వారి చిత్ర పటానికి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈకార్యక్రమంలో డీసీసీబ్యాంక్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, జడ్పీ వైస్ చైర్మన్ గజ్జల శ్రీరాములు, మండల పార్టీ అధ్యక్షులు పోలీపల్లి శంకర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, మండల, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.