మృతుల కుటుంబాలను పరామర్శించిన టిఆర్ఎస్ నాయకులు
తుంగతుర్తి సెప్టెంబర్ 18 (ప్రజాజ్యోతి)//. తుంగతుర్తి మండల పరిధిలోని కొత్తగూడెం గ్రామానికి చెందిన సాక్షి దినపత్రిక సీనియర్ పాత్రికేయులు వర్దేల్లి వీరమల్లు తల్లి మల్లమ్మ, తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన హోంగార్డు కటకం రవి తండ్రి పోతులూరయ్య గార్లు ఆదివారం ఉదయం తమ స్వగ్రామాలలో అనారోగ్యంతో మృతిచెందారు. కాగా టిఆర్ఎస్ మండల నాయకులు మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి తమ సంతాపం వ్యక్తం చేశారు.