ఘనంగా జాతీయ సమైక్యత వజ్రోత్సవ ర్యాలీ

Submitted by Yellaia kondag… on Fri, 16/09/2022 - 16:11
 Grand National Unity Diamond Jubilee Rally

తుంగతుర్తి సెప్టెంబర్ 16 (ప్రజా జ్యోతి)  , జాతీయ వజ్రోత్సవ ఉత్సవాల్లో భాగంగా తుంగతుర్తి నియోజకవర్గ  కేంద్రంలో  పిడి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ ఈ యొక్క ర్యాలీ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ ముఖ్యఅతిథిగా ఈ యొక్క ర్యాలీలో విద్యార్థులు, యువతీ వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు,యువకులు, మహిళలలు జాతీయజెండాల్ని చేతబూని నియోజకవర్గ కేంద్రంలోని మైనార్టీ గురుకుల పాఠశాల నుండి రామాలయం వరకు   చేపట్టిన ర్యాలీని శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్  ప్రారంభించారు. జాతీయజెండా పట్టుకుని ర్యాలీలో విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ మాట్లాడుతూ.. రాచరికం నుంచిప్రజాస్వామ్యంలోకి వచ్చి 75 వసంతాలు పూర్తికావడంతో వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని  తెలిపారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మోహన్ రావు, పిడి కిరణ్ కుమార్, డీఎస్పీ నాగభూషణం, ఆయిల్ ఫిట్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గుజ్జ యుగంధర్ రావు,జిల్లా పరిషత్ చైర్మన్ గుజ్జ దీపిక యుగంధర్ రావు, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్ ఏ రజాక్, తుంగతుర్తి ఎంపిపి గుండ గాని కవిత రాములు గౌడ్, ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు, తిరుమలగిరి మున్సిపల్ చైర్మన్ పోతరాజు రజిని, అర్వపల్లి జడ్పిటిసి దావుల వీరప్రసాద్ యాదవ్, మున్సిపల్ చైర్మన్లు, పిఎసిఎస్ చైర్మన్లు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య, ప్రధాన కార్యదర్శి కటకం వెంకటేశ్వర్లు,అన్ని మండలాల టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు,నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల ఎంపీపీలు, ఎంపీడీవోలు ఎమ్మార్వోలు,అన్ని శాఖల అధికారులు, అంగన్వాడి, ఆశ కార్యకర్తలు, మహిళా సంఘాల మహిళలు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.