తుంగతుర్తి సెప్టెంబర్ 17 (ప్రజా జ్యోతి)//. విరాట్ విశ్వకర్మ జయంతిని పురస్కరించుకొని శనివారం తుంగతుర్తి మండల కేంద్రంలో విశ్వబ్రాహ్మణ ,విశ్వకర్మల సంఘం మండల అధ్యక్షులు కటకం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకలలో భాగంగా విరాట్ విశ్వకర్మ భగవాన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మండల విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ చారి మాట్లాడుతూసకల దేవతల గురువు అయినా భగవాన్ విరాట్ విశ్వకర్మ సైన్స్ కూడా కనిపెట్టలేని ఎన్నో గొప్ప గొప్ప నిర్మాణాలు చేశారని అన్నారు. సకల దేవతల పూజలు అందుకున్న భగవాన్ విరాట్ విశ్వకర్మ చేతివృత్తులకు అధ్యుడని, సైన్స్ ఎంతగానో అభివృద్ధి చెందినప్పటికీ విశ్వకర్మ వేసిన బీజమే దినదినాభివృద్ధి చెందుతుందన్నారు. అనంతరం మండల విశ్వబ్రాహ్మణ విశ్వకర్మల సంఘం అధ్యక్షులు కటకం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.ప్రపంచ సృష్టికర్తలు విశ్వబ్రాహ్మణులు అయినా వారి జీవితాలు చాలా దుర్భరంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విశ్వబ్రాహ్మణుల జీవితాలు బాగుపడాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆదుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణుల, విశ్వకర్మల నాయకులు సూర్యాపేట జిల్లా సామిల్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కటకం ఉప్పలయ్య, వార్డు మెంబర్ కటకం సూరయ్య, మడూరి రమేష్, తాటిపాముల యాకన్న, తాటిపాముల శ్రీనివాసచారి, రామడుగు భాస్కర్, రామడుగు షణ్ముఖ చారి, కటకం భగవంతుయ్య, కటకం రవి, కటకం వెంకన్న, కాగితాల రామాచారి, కటకం ప్రభాకర్, కత్తు రోజు వెంకటాద్రి, కటకం శ్రీను, కటకం నరేష్, కటకం యువరాజ్, తదితరులు పాల్గొన్నారు.