ఆర్థిక సహాయం అందజేసిన సర్పంచ్

Submitted by Yellaia kondag… on Mon, 19/09/2022 - 11:21
 Sarpanch who provided financial assistance

తుంగతుర్తి సెప్టెంబర్ 18 (ప్రజా జ్యోతి)//. మండల పరిధిలోని సంగెం గ్రామపంచాయతీలో  విద్యుత్ లైన్ మెన్ కి ప్రైవేట్ హెల్పర్ గా పనిచేస్తున్న అన్నారం గ్రామానికి చెందిన వీరబోయిన శ్రవణ్ కొద్దిరోజుల క్రితం ప్రమాదవశాత్తు విద్యుతఘాదానికి గురై  కరెంట్ స్తంభం నుండి క్రింద పడి ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శ్రవణ్ కుటుంబ సభ్యులను శనివారం తన స్వగ్రామానికి వెళ్లి యోగక్షేమాలు తెలుసుకొన్న సంగెం గ్రామ సర్పంచ్ ఏశమల్ల సుశీలసామెల్  పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు, వారి వెంట అన్నారం సర్పంచ్ మిట్టగడుపుల అనూక్ , మండల కాంగ్రెస్ అధ్యక్షులు దొంగరి గోవర్ధన్  , మండల కాంగ్రెస్  ఉపాధ్యక్షులు మారగాని వెంకటయ్య  , ఉప సర్పంచ్ అనితలింగయ్య , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాకులారపు మధుసూధన్ రెడ్డి  , ఇరుగు ఎలేజర్ తదితరులు పాల్గొన్నారు.