ఘనంగా జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలు

Submitted by Yellaia kondag… on Sat, 17/09/2022 - 16:05
National Unity Day celebrations


తుంగతుర్తి సెప్టెంబర్ 17 (ప్రజా జ్యోతి)//.  తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా తుంగతుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, అన్ని ప్రభుత్వ,ప్రైవేట్ పాఠశాలలతో పాటు మండల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీలలో ఘనంగా నిర్వహించి భారత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తుంగతుర్తి సబ్ జూనియర్ సివిల్ కోర్టులో ఇన్చార్జి న్యాయమూర్తి  సురేష్ కుమార్,పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ డానియల్ కుమార్, తహసిల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో రాంప్రసాద్, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ గుండగాని కవితా రాములు గౌడ్, రైతు సేవ సహకార సొసైటీలో చైర్మన్ గుడిపాటి సైదులు, వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో చైర్మన్ పులుసు యాదగిరి గౌడ్, గ్రంథాలయంలో చైర్మన్ గోపగాని రమేష్ గౌడ్, వ్యవసాయ కార్యాలయంలో ఏడిఏ జగ్గు నాయక్, ప్రభుత్వ వైద్యశాలలో మండల వైద్యాధికారి డాక్టర్ నాగు నాయక్, ఎక్సైజ్ కార్యాలయంలో సిఐ బాలాజీ నాయక్ , పాఠశాలల ప్రధానోపాధ్యాయులు  త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించగా ఈ యొక్క కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ సూరారపు పుష్ప, ఆర్ఐలు రవీందర్ రెడ్డి, మహమూద్ ఆలీ,వైస్ ఎంపీపీ మట్టపల్లి శ్రీశైలం యాదవ్, స్థానిక ఎంపీటీసీ చేరుకు సృజనా పరమేష్,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య, ప్రధాన కార్యదర్శి కటకం వెంకటేశ్వర్లు,జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్, తునికి సాయిలు గోపగాని శ్రీను, పులుసు వెంకటనారాయణ గౌడ్, బొంకూరు జలంధర్, తడకమల్ల రవికుమార్,ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.