ప్రతి కార్యకర్త కుటుంబానికి అండగా మన ఎమ్మెల్యే

Submitted by Yellaia kondag… on Sat, 17/09/2022 - 16:07
Our MLA is with every worker's family


తుంగతుర్తి సెప్టెంబర్ 17 (ప్రజా జ్యోతి)//  తుంగతుర్తి శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్.ప్రతి పేద కుటుంబానికి అండగా ఉంటూ.. మండలంలో ఏ కార్యకర్తకు ఆపద వచ్చిన పెద్ద కొడుకులా నేనున్నానంటూ ప్రతి  కుటుంబానికి అండగా నిలుస్తున్నారని   టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య అన్నారు. శనివారం తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన టిఆర్ఎస్ కార్యకర్త మల్లెపాక రమేష్ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా విషయం తెలిసిన ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ పంపించిన పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని స్థానిక టిఆర్ఎస్ నాయకుల చేతుల మీదుగా మృతుని కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం అదే గ్రామానికి చెందిన బొంకూరు గోపి  తన ఉన్నత చదువుల కోసం పంపించిన పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అతనికి అందజేశారు.  ఈ సందర్భంగా టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య మాట్లాడుతూ... మండల పరిధిలోని  ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులతో పాటు ప్రతి కార్యకర్త కుటుంబానికి  పెద్ద కొడుకుగా ఎమ్మెల్యే అండగా ఉంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు, వైస్ ఎంపీపీ మట్టపల్లి శ్రీశైలం యాదవ్, ఎంపీటీసీ చెరుకు సృజనా పరమేష్, మండల ప్రధాన కార్యదర్శి కటకం వెంకటేశ్వర్లు, పట్టణ శాఖ అధ్యక్షులు గోపగాని శ్రీను, గ్రంథాలయ చైర్మన్ గోపగాని రమేష్ గౌడ్, గునుగంటి సంతోష్,ఆకారపు భాస్కర్, మల్లెపాక వెంకన్న, తడక మల్ల రవికుమార్, బొంకురి జలంధర్, నాగయ్య, శ్యాంసుందర్, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.