జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలి

Submitted by mahesh yadhav on Thu, 15/09/2022 - 10:38
National integration Vajrotsavam should be celebrated grandly

ప్రజా జ్యోతి నాగారం 14 సెప్టెంబర్. తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో ఈనెల 16న జాతీయ సమైక్యత వజ్రోత్సవాల   సందర్భంగా నిర్వహించే ర్యాలీలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని ఎంపీడీవో జి. శోభారాణి అన్నారు. బుధవారం నాగారం మండల పరిషత్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూతుంగతుర్తి గురుకుల  పాఠశాల  నుంచి రామాలయం  వరకు  తెలంగాణ జాతీయ సమైక్యత ర్యాలీ నిర్వహించనునట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కల్లట్లపల్లి ఉప్పలయ్య, తాహసి ల్దార్ హరిచంద్ర ప్రసాద్, ఎంపీ ఓ దారశ్రీనివాస్, డాక్టర్ నీలిమ, ఏపీఎం నగేష్, ఏపీవో రవి, ఐసిడిఎస్ సూపర్వైజర్ ప్రమీల, ఆశ వర్కర్లు ,అంగన్వాడీ టీచర్లు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.