మృతుల కుటుంబాలను పరామర్శించిన టిఆర్ఎస్ నాయకులు

Submitted by Yellaia kondag… on Mon, 19/09/2022 - 11:38
TRS leaders visited the families of the deceased

తుంగతుర్తి సెప్టెంబర్ 18 (ప్రజాజ్యోతి)//. తుంగతుర్తి మండల పరిధిలోని కొత్తగూడెం గ్రామానికి చెందిన  సాక్షి దినపత్రిక సీనియర్ పాత్రికేయులు వర్దేల్లి వీరమల్లు తల్లి మల్లమ్మ, తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన హోంగార్డు కటకం రవి తండ్రి పోతులూరయ్య గార్లు ఆదివారం ఉదయం తమ స్వగ్రామాలలో  అనారోగ్యంతో మృతిచెందారు. కాగా టిఆర్ఎస్ మండల నాయకులు మృతుల కుటుంబ సభ్యులను  పరామర్శించి తమ సంతాపం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య, ప్రధాన కార్యదర్శి కటకం వెంకటేశ్వర్లు, కొత్తగూడెం గ్రామ సర్పంచ్ నకిరేకంటి విజయ్, ఎంపీటీసీ చెరుకు సృజన పరమేష్, గోపగాని శ్రీను,మల్లెపాక వెంకన్న, ఆకారపు భాస్కర్, జలంధర్,తడకమల్ల రవికుమార్, బొంకూరు జలంధర్, తదితరులున్నారు.