జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను విజయవంతం చేయాలి డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు
తుంగతుర్తి సెప్టెంబర్ 13 (ప్రజా జ్యోతి) ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 16 నుంచి 18వరకు చేపట్టనున్న జాతీయ సమైక్యత వజ్రోత్సవ ర్యాలీ విజయవంతం చేయాలని ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిసిబి డిసిఎంఎస్ డైరెక్టర్ గుడిపాటి సైదులు కోరారు. తుంగతుర్తి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం వైస్ ఎంపీపీ మట్టపల్లి శ్రీశైలం యాదవ్ అధ్యక్షతన జరిగిన సన్నాహక సమావేశంలో అధికారులు, ప్రజాప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 16 నుంచి 18వరకు మూడు రోజులపాటు జాతీయ సమైఖ్యత వజ్రో త్సవాలు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.