ఉపాధి హామీ పని లో వేలిముద్ర పడని వారు ఎం పి డి ఓ కార్యాలయానికి వెళ్ళండి ఎం పి పి గోపాల్
పాలక వీడు,సెప్టెంబర్21(ప్రజా జ్యోతి): పాలకీడు మండలంలో ఉపాధి హామీ పథకంలో పనిచేసి వేలిముద్రలు పడక వేతనాలు అందని వారికి మండల పరిషత్ కార్యాలయంలో పరిష్కారం లభిస్తుందని ఎంపీపీ బూక్య గోపాల్ నాయక్ సూచించారు. కూలీలు ఆధార్ కార్డు, జాబ్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ బుక్ జెరాక్స్ కాపీ లతో మండల పరిషత్ కార్యాలయం లో అప్డేట్ చేయించుకొనే అవకాశం ఉందని తెలిపారు. ఆ తరువాత సమీప పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంకు నుండి ఉపాధి హామీ డబ్బులు పొందవచ్చన్నారు.కార్యక్రమంలో ఎం పి డి ఓ శ్రీనివాస్ రెడ్డి, ఎ పి ఓ సందీప్ రెడ్డి, పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.