బోత్తల పాలెం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల ప్రతిభ ను తెలుసుకొన్న నోడల్ అధికారి బాలు

Submitted by Ramesh Peddarapu on Wed, 21/09/2022 - 15:59
Students of Bothala Palem Primary School Balu was the nodal officer who got to know Pratibha

పాలక వీడు,సెప్టెంబర్21(ప్రజా జ్యోతి):  పాలకీడు మండలం బొత్తల పాలెం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలని  తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా  మండల నోడల్ అధికారి బాలు సందర్శించారు. పాఠశాలలో బోధనా విధానం అమలవుతున్న తీరును , తరగతి గదులవారీగా పరిశీలించారు. విద్యార్థుల స్థాయి, వారు పాఠ్యాంశాలని అర్థం చేసుకుంటున్న స్థితిని అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులకు,  విద్యార్థులకు తగు సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్పీలు పూల్ సింగ్, నాగార్జునతో పాటు  ప్రధానోపాధ్యాయుడు రెడ్డిపల్లి శ్రీనివాస్, ఉపాధ్యాయులు ధర్మరాజు, మక్త నాయక్, యూసుఫ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.