సెప్టెంబర్ 17న బంజారా భవన్ ఓపెనింగ్ ని జయ ప్రదం చేయండి బంజారా నాయకులు

Submitted by Ramesh Peddarapu on Fri, 16/09/2022 - 10:53
Celebrate the opening of Banjara Bhavan on September 17   Banjara leaders

పాలక వీడు,సెప్టెంబర్15(ప్రజా జ్యోతి):  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు సెప్టెంబర్ 17, నా హైదరాబాదులో ప్రారంభించబోయే సేవాలాల్ బంజారా భవన్, కొమరం భీమ్ ఆదివాసి భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి  రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కే సి ఆర్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ ట్రై కార్ చైర్మన్ ఇస్లావత్ రామచంద్రనాయక్, పిలుపుమేరకు అదేవిధంగా హుజూర్నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి  ఆదేశానుసారం  హుజూర్నగర్ నియోజకవర్గంలోని గిరిజన ప్రజా ప్రతినిధులు  ఉద్యోగులు ,మేధావులు ,పార్టీలకు అతీతంగా సెప్టెంబర్ 17న జరగబోయే గిరిజన సభకు హుజూర్నగర్ నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో హాజరై సభను జయప్రదం చేయాలని పాలకీడు మండలంలోని ఎస్టీ సెల్ అధ్యక్షుడు బండావత్ రామారావు, ఏఐబిఎస్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రమావత్ నరి నాయక్, జాన్పాడుదర్గా గ్రామ పార్టీ అధ్యక్షుడు భూక్యా రాజశేఖర్ నాయక్  బెట్ట తండా వైస్ సర్పంచ్ లావుడియా నాగేశ్వరావు  కోరినారు.