34లక్షల తో పాటశాల అభివృద్ధికి శంఖుస్థాపన చేసిన ఎం పి పి గోపాల్

Submitted by Ramesh Peddarapu on Tue, 20/09/2022 - 10:34
MPP Gopal laid the foundation stone for the development of Patashala with 34 lakhs

పాలక వీడు,సెప్టెంబర్19(ప్రజా జ్యోతి): మనఊరు- మనబడి లో బాగంగా జాన్ పహాడ్ దర్గా కాల్మెట్ తండ ప్రాథమిక పాఠశాల నందు అభివృద్ధి కోసం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లో 16 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం నిధులు 18 లక్షలు 34 లక్షలు మంజూరు తో అదనపు తరగతి గది,ప్రహరీగోడ, మౌలిక సదుపాయాల కల్పన పనులకు ఎం పి పి భూక్యా గోపాల్ నాయక్ శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమం లో స్థానిక సర్పంచ్ రూపవత్ ఘోరీ, బెట్టె తండ సర్పంచ్ మాలోత మోతిలాల్ నాయక్, ఎం ఈ ఓ చత్రు నాయక్,నాయకులు బానోత వెంకట్, కిషన్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.