గ్రామాల్లో ఆరోగ్య అవగాహన సదస్సులు అంతంత మాత్రమే
- గ్రామాల్లో నామమాత్రంగానే డ్రైడే ఫ్రైడే
- రోజురోజుకు పెరుగుతున్న వైరల్ జ్వరాలు
- దొరికిన కాడికి దోచుకుంటున్న గ్రామీణ వైద్యులు
గుండాల సెప్టెంబర్ 04(ప్రజా జ్యోతి) యాదాద్రి జిల్లా గుండాల మండలంలోని గ్రామాలలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండల వ్యాప్తంగా అనేక వైరల్ జ్వరాలు వ్యాపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వైరల్ బారిన పడిన ప్రజలు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించుకోకుండా, ప్రభుత్వం ఉచితంగా అందించే మాత్రలు గ్రామంలోని గ్రామీణ వైద్యులను తీసుకోకుండా గ్రామాల్లోని గ్రామీణ వైద్యులైన ఆర్ఎంపీలను ఆశ్రయిస్తున్నారు.