పేదలకు అండగా సిఎం కెసిఆర్

Submitted by krishna swamy on Wed, 14/09/2022 - 14:26
 CM KCR stands by the poor
  • కొండమడుగు గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ


బిబినగర్, సెప్టెంబర్ 14 (ప్రజా జ్యోతి) పేద ప్రజల సంక్షేమమే టిఆర్ఎస్ ప్రభుత్వం ఆశయంగా ముందుకు సాగుతున్న తెలంగాణ సిఎం కేసీఆర్కు ప్రజలు రుణపడి ఉండాలని టీఆరెస్ నాయకులు కోరారు. బిబినగర్ మండలంలోని  కొండమడుగు గ్రామనికి స్థానిక ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి సహకారంతో తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాధితులు ఆడెపు పద్మ భర్త ఆడెపు మల్లేష్  20,000 మరియు వాకిటి కృష్ణా రెడ్డి 60,000 వేల చెక్కును టిఆర్ఎస్ పార్టీ బీబీనగర్ మండలం ప్రధాన కార్యదర్శి చింతల సుదర్శన్ రెడ్డి టిఆర్ఎస్ కొండమడుగు గ్రామ శాఖ అధ్యక్షులు బత్తుల శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు వాకిటి సత్యనారాయణ రెడ్డి దేశం శ్రీకాంత్ గౌడ్,ఎస్ఎంసి చైర్మన్ కనకబోయిన రాజమల్లెష్ టిఆర్ఎస్ పార్టీ బీబీనగర్ మండలం కార్మిక విభాగం అధ్యక్షులు వాకిటి రాజేశ్వర్ రెడ్డి ఉపాధ్యక్షులు పెంటబోయిన వేణు, ఆడెపు ఆంజనేయులు టిఆర్ఎస్ సీనియర్ నాయకులు కడెం అశోక్, మేకల మహేశ్ గౌడ్, బద్దం లక్ష్మారెడ్డి, బద్దం మాధవ రెడ్డి, కొప్పుల లక్ష్మారెడ్డి, జవాజి పాండు తదితరులు పాల్గొన్నారు.