రైతు ను రాజును చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం

Submitted by krishna swamy on Fri, 02/09/2022 - 16:55
The aim of the Congress party is to make the peasant a king
  • మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి చౌటుప్పల్

సెప్టెంబర్ 2 ప్రజా జ్యోతి ; టిఆర్ఎస్ బిజెపి పార్టీలకు బుద్ధి చెప్పేలా  మునుగోడు నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిని  గెలిపించి, మునుగోడు గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరవేయడమే లక్ష్యం కార్యకర్తలకు కృషి చేయాలని మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి అన్నారు.

చౌటుప్పల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన  సమన్వయ  కర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు ను రాజు ను చేయడమే లక్ష్యంగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదేశానుసారంతో గడపగడపకు కాంగ్రెస్ పార్టీ,l అనే నినాదంతో, టిఆర్ఎస్బి జెపి పార్టీల అవినీతిని ఎండగాడుతూ, కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రజలను చైతన్య పరుస్తూ గడపగడపకు,  కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం చేపడతామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో చలమల్ల కృష్ణారెడ్డి, ఏఐసీసీ సభ్యురాలు పాల్వాయి స్రవంతి రెడ్డి, పల్లె రవికుమార్, ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తిరుపతి రవీందర్, ఆకుల ఇంద్రసేనారెడ్డి , సుర్వి నరసింహ గౌడ్,  భీమిడి ప్రదీప్ జి తదితరులు పాల్గొన్నారు.